Skip to main content

ఇలాంటి తల్లులు భూమిపై అరుదుగా జన్మిస్తారు...యువకుల ప్రాణం కోసం.. తమ ఒంటిపై చీరలు తీసి మరీ..

 ఇలాంటి తల్లులు భూమిపై అరుదుగా జన్మిస్తారు...యువకుల ప్రాణం కోసం.. తమ ఒంటిపై చీరలు తీసి మరీ... తమ మానాలను సైతం పక్కనపెట్టి చేసిన సహాయం ఇలాంటి తల్లులు కడుపున ఎందుకు పుట్టలేదా అన్న బాధ  కలగకమానదు.....


ప్రస్తుతం సమాజంలో మానవత్వం చచ్చిపోయింది. కళ్లెదుట ప్రాణం పోతున్నా.. కనీసం ఎవరూ స్పందించడం లేదంటూ రోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు మంచి మనసు ఉన్న మహాత్ములు ఉన్నారు. ఈ పైన ఫోటోలో కనిపిస్తున్న స్త్రీలే అందుకు నిదర్శనం. తమ కళ్ల ముందు ప్రాణాలు పోతున్న వ్యక్తులను కాపాడేందుకు వీరు.. తమ ఒంటిపై ఉన్న చీరలను తీసి మరి వారిని కాపాడారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


తమిళనాడు రాష్ట్రం పెరంబళూరు జిల్లా కొట్టరాయి ప్రాంతానికి చెందిన మహిళలు.. తమ మానాన్ని పక్కన పెట్టి యువకుల ప్రాణం నిలబెట్టారు. స్థానికంగా ఉన్న ఓ డ్యామ్ లో కొందరు కుర్రాళ్లు ప్రమాదవశాత్తు పడిపోయారు.


వారిని చూసిన ముగ్గురు మహిళలు.. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారి వద్ద ఎలాంటి తాడు లేకపోవడంతో.. తమ ఒంటిపై ఉన్న చీరలను విప్పదీసి.. ఆ మూడింటినీ ముడి వేసి.. వెంటనే డ్యామ్ లో ఉన్న కుర్రాళ్లకు అందేలా వేశారు. వారు పట్టుకోగానే.. తమ బలమంతా ఉపయోగించి వారిని పైకి లాగారు.


ఆ యువకులు క్రికెట్ మ్యాచ్ అనంతరం డ్యామ్ లో స్నానానికి వచ్చి ప్రమాదంలో పడినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో డ్యామ్ లో నీటి మట్టం బాగా పెరిగిపోయింది. దీంతో.. వారు ప్రమాదంలో పడ్డారు.


కాగా.. వారిని చూసిన సెంటమిజ్ సెల్వి, ముతమల్ మరియు ఆనందవల్లి లు వెంటనే తమ చీరల సహాయంతో కాపాడారు. అయితే... మొత్తం నలుగురు కుర్రాళ్లు నీటిలో మునగగా.. ఇద్దరిని ఈ మహిళలు కాపాడగలిగారు. మరో ఇద్దరు నీటిలో మునిగివడం గమనార్హం. కాగా. సదరు మహిళలు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారికి ఎంత గొప్ప అవార్డు ఇచ్చిన తప్పులేదని పేర్కొంటున్నారు. నెట్టింట కూడా వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Comments

Popular posts from this blog

India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

July 1:  దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది.  కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...

ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా బెంగళూరు బాలికకు వల.. సహజీవనం చేద్దామంటూ

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన బెంగళూరు బాలికను సహజీవనం చేద్దామంటూ నమ్మించి హైదరాబాద్‌కు రప్పించేందుకు ఏర్పాట్లన్నీ చేశాడు. చివర్లో ఆమె తండ్రికి తెలియడంతో వాడి బండారం బయటపడింది. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన బాలికను నమ్మించి సహజీవనానికి రెడీ అయిన  హైదరాబాద్  యువకుడి ప్రయత్నం ఆఖరి నిమిషంలో బెడిచికొట్టింది. హైదరాబాద్‌లోని తన వద్దకు వచ్చేయాలంటూ ఆమె విమాన టిక్కెట్లు బుక్ చేసి మరీ పంపాడు. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తండ్రి ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. ఆఖరి నిమిషంలో విమానాశ్రయంలో తన కూతురిని అడ్డగించి యువకుడిపై  బెంగళూరు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులోని ఉత్తరహల్లిలో ఉన్న ఏజీఎస్‌ లేఔట్‌ ప్రాంతానికి చెందిన బాలిక ఓ కార్పోరేట్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడంతో తరుచూ సోషల్‌మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టులు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌కు చెందిన విశాల్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. రోజూ ఛాటింగ్ చేసుకుంటూ ఇద్దరు దగ్గరయ్యారు. దీంతో ఆమె తన వ్యక్తిగత చిత్రాలు...

మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ టీజర్

 ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హవా ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మహేష్ ఇప్పుడు గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశు రామ్ తో సర్కార్ వారి పాట సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ పైకి ఇంకా వెళ్లకపోయినా అభిమానుల్లో మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇప్పటికే మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన మహేష్ బాబు మూడవ సారి కూడా 100 కోట్లు కొట్టబోతున్నాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత రెండు సార్లకు వంద కోట్లు కొట్టిన హీరో కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.మాములు సినిమాలతో కూడా ఆయన 100 కోట్ల రూపాయిల షేర్ ని చాల తేలికగా కొడుతున్నారు.ఇది మహేష్ బాబు స్టార్ డమ్ కి ఉదాహరణ ఇది ఇలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా నుండి లీక్ అయినా ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటి వరుకు మహేష్ బాబు ని మనం ఈ లుక్ లో ఎప్పుడ...