Skip to main content

విశాఖపట్నం పెనుప్రమాదం నుండి బయటపడిన సంఘటన:-

విశాఖపట్నం పెను ప్రమాదం నుండి బయటపడిన :-




ఆరోజు అంటే 6 ఏప్రిల్ 1942 వ సంవత్సరం ఎండాకాలం మిట్టమధ్యాహ్నం రెండవప్రపంచయుద్ధం తీవ్రంగా ఉన్న రోజుల్లో బంగాళాఖాతంలో జపాన్ యుద్ధనౌక వైస్ ఎడ్మిరల్ ఒజ్వాజిసాబ్యురొ నేత్రత్వంలొ యుద్ధవిమానౌక రెయుజొ 29 టైపు 97 కేటిటార్పెడోబాంబర్స్ తో ప్రవేసించింది అంతకుముందే బంగాళాఖాతంలో ఉన్నకొన్ని వాణిజ్య నౌకలు, బ్రిటీష్ వారి యుద్ధనౌకలు ఇండోరా , హర్పాసా ,  మాల్డా , డార్న్డనస్ , ఘండారా లను ముంచివేసాయి.అందులొ నుండి  5 యుద్ధవిమానాలు 250 మరియు 60 కేజీల బాంబులతొ 6 ఏప్రిల్ 1942 ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ఒంటిగంట ఒంటిగంట నలభై ఐదు నిమిషాలు మధ్యలో సెంట్ ఎల్లోసిస్ పాఠశాల మీదుగా విశాఖ నౌకాశ్రయం లొపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసాయి వాటి ముఖ్య ఉద్ధేశ్యం నూతన హర్బర్ , సింధియా నౌకాశ్రయం,విద్యుత్ కేంద్రం మరియు స్టీమర్ పోర్టులపై బాంబులు వేసి ధ్వంసం చేయాలని కానీ వైమానిక దాడిని పసిగట్టి నగరంలో సైరన్లు మ్రొగాయి ప్రభుత్వం వైమానికదాడి సమయంలో తమనుతాము రక్షించుకునేందుకు చర్యలను ప్రజలకు సూచించాయి. అమెరికా యుద్ధనౌక నుండి ఏంటీఎయిర్ క్రాప్ట్ తుపాకులు ప్రేలాయి అందువలన జపాన్ యుద్ధవిమానాలు నౌకాశ్రయం లోనికి ప్రవేశించలేకపోయాయి..మరలా అవే విమానాలు సాయంత్రం 5:25 -5:45 మధ్యలో రెండవసారి దాడిచేసాయి కానీ బాంబులు నిర్దేశించిన గమ్యాన్ని తాకలేకపొయాయి కానీ  పోర్టులొ ఐదు అడుగుల వ్యాసం కల కాంక్రీటు పైపుపై బాంబు పడింది దాడినుండి కాపాడుకోవడానికి అందులో దాగివున్న పి.అప్పలస్వామి , ఈటి పెద్దయ్య , షేక్ ఇబ్రహీం , ఎమ్పాదప్పడు , కే.మునిస్వామి , ఇ.డి. అక్బర్ అనే నౌకాశ్రయ కార్మికులు మరియు కే.ఆనందరావు , ఎన్.మాధవరావు అనే రక్షణశాఖ ఉద్యోగులు ఆ దాడిలో స్వర్గస్తులయ్యారు. ఆ సంఘట స్మారకార్థం ఒక ఫలకం ఇప్పటికీ పోర్టులో ఉంది. అయితే పోర్టులో ఉన్న మెరీన్ ముల్లర్ అనే నౌకపై కొన్ని బాంబులు పడినా ప్రేలలేదు అదే ప్రేలిఉంటే అందులొ  ఉన్న 2000 వేల టన్నుల  మందుగుండు ప్రేలి విశాఖపట్నం తుడిచిపెట్టుకొని పోయి రెండవ పెరెల్ హర్భర్ గా మారేది. అందులొ ప్రేలని ఒక బాంబు విశాఖమ్యూజియంలొ భద్రపరిచారు.





బాంబుల దాడి భయంతో ప్రభుత్వం రైళ్ళను రద్దుచేసింది , దుఖాణాలు మూతపడ్డాయి. ప్రజలు జట్కా , ఎడ్లబండ్లపై మరియు కాలినడకన యద్ధభయంతొ పట్టణప్రజలు చాలామంది తమ స్థిరాస్తులను కారుచౌకగా అమ్మివేసి తట్టాబుట్టా సర్దుకొని ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. తిండిగింజలకు కరువు కేవలం నూకలగంజి బంగాళాదుంపలు తిని పొట్టనింపుకున్నారు.ఆతరువాత రేషన్ మూలంగా కొన్ని సంవత్సరాలు నూకలు, గోధుమలు కొరకు ప్రజలు  బారులు తీరారు. అప్పటి భయానక సంఘటన పాతతరం వారికి మరపురానివి.ఈ ఫోటోలొ తెల్లని మచ్చలు బాంబులు వేసిన ప్రాంతం.

Comments

Popular posts from this blog

India Enters Unlock 2.0: నేటి నుంచి అన్‌లాక్ 2.0, కొత్తగా ఓపెన్ అయ్యేవి ఏంటి? మూతపడేవి ఏంటి? జూలై 1 నుంచి 31 వరకు అమల్లోకి రానున్న అన్‌లాక్ 2.0, పూర్తి వివరాలు తెలుసుకోండి

July 1:  దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 (India Enters Unlock 2.0) ప్రారంభమయింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ( Unlock 2 Guidelines) జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 (Unlock 2.0) ప్రారంభమైంది.  కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచగా ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌత...

ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా బెంగళూరు బాలికకు వల.. సహజీవనం చేద్దామంటూ

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన బెంగళూరు బాలికను సహజీవనం చేద్దామంటూ నమ్మించి హైదరాబాద్‌కు రప్పించేందుకు ఏర్పాట్లన్నీ చేశాడు. చివర్లో ఆమె తండ్రికి తెలియడంతో వాడి బండారం బయటపడింది. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన బాలికను నమ్మించి సహజీవనానికి రెడీ అయిన  హైదరాబాద్  యువకుడి ప్రయత్నం ఆఖరి నిమిషంలో బెడిచికొట్టింది. హైదరాబాద్‌లోని తన వద్దకు వచ్చేయాలంటూ ఆమె విమాన టిక్కెట్లు బుక్ చేసి మరీ పంపాడు. కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తండ్రి ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. ఆఖరి నిమిషంలో విమానాశ్రయంలో తన కూతురిని అడ్డగించి యువకుడిపై  బెంగళూరు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులోని ఉత్తరహల్లిలో ఉన్న ఏజీఎస్‌ లేఔట్‌ ప్రాంతానికి చెందిన బాలిక ఓ కార్పోరేట్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడంతో తరుచూ సోషల్‌మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టులు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో హైదరాబాద్‌కు చెందిన విశాల్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. రోజూ ఛాటింగ్ చేసుకుంటూ ఇద్దరు దగ్గరయ్యారు. దీంతో ఆమె తన వ్యక్తిగత చిత్రాలు...

మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ టీజర్

 ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హవా ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మహేష్ ఇప్పుడు గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశు రామ్ తో సర్కార్ వారి పాట సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ పైకి ఇంకా వెళ్లకపోయినా అభిమానుల్లో మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇప్పటికే మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన మహేష్ బాబు మూడవ సారి కూడా 100 కోట్లు కొట్టబోతున్నాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత రెండు సార్లకు వంద కోట్లు కొట్టిన హీరో కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.మాములు సినిమాలతో కూడా ఆయన 100 కోట్ల రూపాయిల షేర్ ని చాల తేలికగా కొడుతున్నారు.ఇది మహేష్ బాబు స్టార్ డమ్ కి ఉదాహరణ ఇది ఇలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా నుండి లీక్ అయినా ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటి వరుకు మహేష్ బాబు ని మనం ఈ లుక్ లో ఎప్పుడ...